09/02/2019
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి, వసంత పంచమి శ్రీ పంచమి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది, తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనానికి బారులుతీరారు, చివరి రోజైన రేపు బాసరలో సరస్వతి అమ్మవారి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు, స్వచ్ఛందంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాఠశాలల విద్యార్థులు, మిషన్ బాసర యువకులు వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు, బాసర పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు, సరస్వతి నమో నమః నామస్మరణతో బాసర ఆలయం మార్మోగిపోతోంది,